Monday, May 6, 2024

Big Breaking | తొలి టీ20లో డీలాపడ్డ టీమిండియా.. 21 పరుగుల తేడాతే కివీస్​ విజయం

న్యూజిలాండ్​తో జరుగుతున్న టీ20లో టీమిండియా డీలాపడింది. నిర్ణీత ఓవర్లలో తొలి టీ20లో ఇండియాపై కివీస్​ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్​లో భారత్​ పర్వాలేదు అనిపించినా, బ్యాటింగ్​లో మాత్రం అంతగా రాణించలేకపోయింది. ఓపెనర్లు శుభ్​మన్​ గిల్​, ఇషాన్​ కిషన్​, ఆ తర్వాత వచ్చిన మరో బ్యాటర్​ రాహుల్​ త్రిపాఠి ముగ్గురూ ఆకట్టుకోలేకపోయారు. కాగా, కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా, సూర్యకుమార్​ మాత్రం తమదైన శైలిలో బౌండరీలు కొడుతూ కొద్దిసేపు ఎంటర్​టైన్​ చేశారు.

ఇక.. ఆఫ్​ సెంచరీకి చేరువలోనే సూర్యకుమార్​ (47), అవుటయ్యాడు. ఆ తర్వాత పాండ్యా (21), కూడా పెవిలియన్​ చేరాడు. దీంతో తక్కువ పరుగులకే ఇండియా కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత దీపక్​ హుడా (10), శివం మావి (2), కుల్దీప్​ (0) అవుటయ్యారు. దీంతో 8 వికెట్ల నష్టానికి ఇండియా 17 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతానికి క్రీజులో వాషింగ్​టన్​ సుందర్​ (50), అర్షదీప్, ఉమ్రాన్​ మాలిక్​ నాటౌట్​గా నిలిచారు.​ అయితే.. న్యూజిలాండ్​ బౌలర్ల దాటికి వెను వెంటనే వికెట్లు కోల్పోయినా.. వాషింగ్​టన్​ సుందర్​ భేష్​ అనిపించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement