Thursday, May 9, 2024

బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారులకు సువర్ణావకాశం.. అక్టోబర్‌లో మరో లీగ్‌

ఎలైట్‌ ప్రో బాస్కెట్‌ బాల్‌ లీగ్‌ అనేది భారత దేశపు మొట్ట మొదటి ప్రొ బాస్కెట్‌ బాల్‌ లీగ్‌. ఇందులో 12 జట్లను అగ్రస్థాయి భారతీయ ఆటగాళ్ల జాబితా ఇంతకుమునుపు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత మేనెలలో నిర్వహించిన ఈ లీగ్‌లో 250 మంది అథ్లెట్స్‌ హాజరయ్యారు. భారత దేశంలో ఇప్పటి వరకు నిర్వహిం చబడిన అతిపెద్ద బాస్కెట్‌ బాల్‌ లీగ్‌ ఇదే. అయితే బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులు తమ సత్తాచాటుకోవడానికి మరో వేదిక సిద్దమైంది. అక్టోబర్‌లో వీటిని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement