Friday, April 26, 2024

Breaking: కివీస్‌పై ఇంగ్లండ్ విజ‌య‌భేరి.. న్యూజిలాండ్ సెమీస్ ఆశ‌ల‌పై నీళ్లు!

టీ20 వరల్డ్ కప్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు జోస్ బ‌ట్లర్‌, అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. దీంతో కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు. న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు.

టార్గెట్ చేజింగ్ లో న్యూజిలాండ్ 159 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో విలియమ్సన్ 40, ఫిలిప్స్ 62 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, సామ్ కరన్ త‌లా 2 వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసారు. ఇక‌.. త‌దుప‌రి ఐర్లాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో కివీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. ఈ మ్యాచ్ లో కివీస్ ఓడినా, ఒక‌వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా కివీస్ సెమీస్ కు చేరడం కష్టమే అవుతుంది. కివీస్ పై విక్టరీతో ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement