Saturday, April 20, 2024

Shame: నాలుగేళ్ల బాలికపై అఘాయిత్యం.. రేప్​  చేసి చెరుకుతోటలో పడేసిన దుర్మార్గుడు

మధ్యప్రదేశ్​లో ఘోరం జరిగింది. ఓ నాలుగేండ్ల చిన్నారిని దారుణంగా రేప్​ చేసి, చెరుకు తోటలోని పొదల్లో పడేసి వెళ్లిపోయాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) వెలుగులోకి వచ్చిందని ఖండ్వా జిల్లా ఎస్పీ వివేక్​ సింగ్​ తెలిపారు. నిన్న (సోమవారం) పొలాల్లోని పొదల్లో అపస్మారక స్థితిలో ఆ బాలిక కనిపించడంతో స్థానికుల సహాయంతో పోలీసులు ఇండోర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

సోమవారం ఉదయం జస్వాడిలోని తన బంధువుల ఇంటి నుంచి బాలిక కనిపించకుండా పోయిందని ఫిర్యాదు అందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. పోలీసులకు సమాచారం అందగానే అదృశ్యమైన బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విచారణలో భాగంగా లోకల్​గా ఉండే ఓ షాపులో పనిచేస్తున్న 25 ఏళ్ల యువకుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఆ వ్యక్తి ఆదివారం రాత్రి బాధితురాలి కుటుంబంతో పరిచయం ఉన్నవాడేనని, ఆ రాత్రి వారి ఇంటి నుంచి పడుకునేందుకు మంచాన్ని తీసుకెళ్లేందుకు వచ్చాడని ఎస్పీ తెలిపారు. కాగా, పోలీసుల ఎంక్వైరీలో బాలికను పొలానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు.  

- Advertisement -

అయితే.. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తొలుత జిల్లా ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించినట్లు ఎస్పీ వివేక్​ తెలిపారు. నిందితుడు బాలిక నిద్రిస్తున్న సమయంలో అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి.. పొలానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆ తర్వాత పొదల్లో పడేసినట్టు చెప్పారు. దీంతో నిందితుడిపై IPC 363, 376, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (POCSO) ​ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement