Friday, April 26, 2024

చెన్నై టీమ్​కి కెప్టెన్​ దోని.. ఐపీఎల్​లో ఇదే చివరి గేమ్​?

ఇండియన్​ క్రికెట్​లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న బ్యాట్స్​మన్​ మహేంద్రసింగ్​ ధోని. జులపాల జుట్టుతో టీమిండియాలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్​లో బ్యాటింగ్​ చేయడమేకాకుండా తనకు ప్రత్యేకమైన వికెట్​ కీపింగ్​లోనూ ఎంతో పేరుగాంచాడు. ఇండియాకు టీ20 వరల్డ్​ కప్​, ఐసీసీ క్రికెట్​ వరల్డ్​ కప్ ట్రోఫీలను అందించిన​ ధోని అంటే అందరికీ ఎంతో ఇష్టం. అయితే తాను 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్​బై చెప్పాడు. కానీ, ఐపీఎల్‌లో చెన్నై టీమ్​కి నాయకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ భారత మాజీ కెప్టెన్ ని ఈ ఏడాది జరిగే ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు మరోసారి కెప్టెన్సీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

ఈసారి రవీంద్ర జడేజా, అంబటి రాయుడికి కెప్టెన్సీ దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, చివరకు మహికే మరోసారి చెన్నై టీమ్​ పగ్గాలు రానున్నట్టు తెలుస్తోంది. ఇదే చివరి గేమ్​ కావొచ్చేమోనన్న వార్తలు కూడ వస్తున్నాయి. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరగబోయే ఐపీఎల్​ మ్యాచులకు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement