Tuesday, April 23, 2024

క‌రోనా ఎఫెక్ట్ : జడ్పీ సమావేశం వాయిదా

జడ్పీ సమావేశం వాయిదా పడింది. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా రెడ్డి ప్రకటించారు. ఈరోజు జడ్పీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి మాత్రమే హాజరయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి చైర్ పర్సన్ అనితా రెడ్డి వేచి చూడాల్సి వచ్చింది. అధికారులు కూడా చాలా మంది హాజరు కాలేదు. చాలా మంది కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్ ఉండటంతో కింది స్థాయి అధికారులు హాజరయ్యారు. చేసేది ఏమీ లేక జడ్పీ సర్వ సభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్ పర్సన్ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement