Tuesday, May 7, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఏర్పాటు.. సభ్యులు ఎవరంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీనీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. చైర్మన్ సహా 16 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ హజ్ కమిటీకి ఎపి స్టేట్ వక్ప్ బోర్డు అధ్యక్షులు(ప్రస్తుతం కాంపిటెంట్ అధారిటీ ద్వారా నిర్వహించబడుతోంది)గా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ అధికారి స్టేట్ వక్ప్ బోర్డు హజ్ కమిటీకి ఎక్స్ అఫీసియో సభ్యులుగా మరియు సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు.

ఇంకా ఈ స్టేట్ హజ్ కమిటీలో మున్నీర్ భాషా,మహ్మద్ నవాజ్ భాషా(ఎంఎల్ఏ),షేక్ ఇసాక్ భాషా(ఎంఎల్సి), మొహమ్మద్ ఇమ్రాన్(కార్పొరేటర్),షేక్ హతవుల్లా(ఎంపిటిసి),షేక్ గులాబ్జన్(కౌన్సిలర్), సయ్యద్ వలీలుల్లా హస్సేన్-హి-సున్నాత్ వాల్ జామత్,ముప్తీ అబ్దుల్ బాషిత్-తబ్లిక్ జామత్,మౌలానా షేక్ మన్జూర్ అహ్మద్-హీల్-హదీస్,షేక్ ఖాదర్,మొహ్మద్ ఇబాదుల్లా,షేక్ మొహ్మద్ భాషా,మొహ్మద్ తారీఖ్,బద్వేల్ షేక్ గౌష్ లాజమ్ లు రాష్ట్ర హజ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement