Saturday, April 27, 2024

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్.. జ‌డేజా బౌండ‌రీ .. క‌న్నీటిప‌ర్యంత‌మ‌యిన భార్య‌

ఐపీఎల్ పైనల్ మ్యాచ్ లో ప‌దిహేను ఓవ‌ర్ల‌లో 171ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించారు. చివరి బాల్ వరకూ కొనసాగిన ఉత్కంఠ పోరుకు జడేజా ఫోర్ బాది తెరదించాడు. రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. ఓ సిక్స్, ఫోర్ బాది చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపాడు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా నరేంద్ర మోడీ స్టేడియానికి వచ్చారు. సీఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా భార్య, జామ్ నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. చివరి బంతికి జడేజా బౌండరీ బాదడంతో రివాబా సంతోషంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఆనందబాష్పాలతో చప్పట్లు చరుస్తూ భర్త జడేజాను, సీఎస్కే ఆటగాళ్లను అభినందించారు. రివాబా కళ్లల్లో ఆనందబాష్పాలను కెమెరా రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా అభిమానులు మిస్టర్ కూల్ గా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీ కూడా గ్రౌండ్ లోకి వెళ్లి జడేజాను ఎత్తుకుని అభినందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement