Thursday, April 18, 2024

అనాథ పిల్ల‌ల‌తో.. సీఎం జ‌గ‌న్ దంప‌తులు

విజ‌య‌వాడ‌లోని మిష‌న‌రీస్ ఆఫ్ ఛారిటీ నిర్మ‌ల్ హృద‌య్ భ‌వ‌నానికి వెళ్లారు ఏపీ సీఎం జ‌గ‌న్ దంప‌తులు. అనంత‌రం నిర్మల్ హృదయ్ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలతో జగన్ దంపతులు ముచ్చటించారు. పిల్లల యోగక్షేమాల గురించి అక్కడున్న నన్స్ ను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు నేటితో సీఎంగా జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర కీలక నేతలు జెండా ఎగురవేశారు. సజ్జల కేక్ కట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement