Thursday, May 16, 2024

ఢిల్లీ తెలంగాణ భవన్​లో ఘనంగా అంబేద్కర్​ జయంతి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ కె.ఎం.సహానీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ విక్రమ్ సింగ్ మాన్, భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement