Sunday, May 19, 2024

20న వరంగల్ కు కేటీఆర్ రాక.. 20వేల మందితో సమావేశం

వరంగల్ (ప్రభ న్యూస్) : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కే. తారకరామారావు ఈ నెల 20వ తేదీన వరంగల్ కు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ఎల్ బీ కళాశాల మైదానములో వరంగల్, హన్మకొండ జిల్లాలకు చెందిన 20 వేల మంది ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో పాల్గొంటారు. కాగా, సభ ఏర్పాట్లను టీఆర్ఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు దాస్యం. వినయభాస్కర్, ఆరూరి రమేష్ గురువారం సాయంత్రం పరిశీలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement