Saturday, April 27, 2024

కరోనాతో తల్లి మృతి.. చెరువులో దూకి కుమారుడు ఆత్మహత్య

కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు లోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడే ముందు యువకుడు శ్రీహరి (22) సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇందులో తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ తన ఆవేదనను వెలిబుచ్చాడు.

కరోనా బారినపడిన తన తల్లి రుక్మిణి(60) చికిత్స పొందుతూ గచ్చిబౌలిలోని ప్రైవేట్‌ దవాఖానలో మృతి చెందిందని సెల్ఫీ వీడియోలో శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశాడు. రూ. 10 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమన్యం చెప్పింది. తన తండ్రి కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని వీడియోలో వాపోయాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహం కోసం చెరువులో గాలింపు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement