Wednesday, May 8, 2024

టీడీపీ OLX లో పెట్టటమే ఇంకా!!

మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో నియోజకవర్గాలలో కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో 23 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో సాధిస్తామని భ్రమ లో చంద్రబాబు బ్రతికేశారని కానీ మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు వైసిపి విజయం సాధించిందని అన్నారు. టిడిపి పార్టీ ని ఓఎల్ఎక్స్ లో పెట్టుకుంటే బెటర్ అని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇకపై రాజకీయాలను వదిలేసి మనవడితో ఆడుకుంటూ శేష జీవితం గడపాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఏ ఎజెండా లేని వ్యక్తి అని విమర్శించారు. వానపాము బుస కొట్టినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. ఒక దగ్గర టీడీపీ కి ఓటు వెయ్యండి అంటాడు, మరో దగ్గర బీజేపీ కి వెయ్యండి అంటాడు..పక్క రాష్ట్రం లో తెరాస కు ఓటు వెయ్యండి అంటాడని ఒక మాటపై ఉండడని విమర్శించారు. వైసిపి రెబల్స్ కు నా విజయంతో సమాధానం చెప్పానన్నారు. రెబల్స్ ఎక్కడ ఉన్నా పార్టీకి నష్టమేనని రోజా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement