Friday, May 3, 2024

అమ్మో ఒక్క రోజులోనే 16,620 కేసులు

రోజురోజుకు కరోనా కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఒకే రోజు భారీగా కరోనా కేసులు పెరిగాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర లోనే సగం నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 16,620 కొత్త కేసులు నమోదయ్యాయి. 40 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,14,413కి చేరుకుంది. ఇప్పటి వరకు 52,861 మంది చనిపోయారు. గత రెండు రోజులుగా మహారాష్ట్రలో 15 వేలకు మించి కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.21 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,26,231 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement