Wednesday, May 8, 2024

బిజెపి వ‌ల్లే విజ‌య‌వాడ‌లో ఓట‌మి – జ‌న‌సేన

‌విజయవాడ: విజయవాడలో జనసేన పార్టీకి బీజేపీవల్ల పెద్ద నష్టం జరిగిందన్నారు జనసేన నేత పోతినేని మహేష్. తాము ఎక్కడికి వెళ్లినా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు వ్యతిరేకించారన్నారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయామన్నారు. పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధానిని వ్యతిరేకించినవాళ్లకు ఓటు వేయవద్దని ఎందుకు పిలుపు ఇవ్వలేదని అమరావతి పరిరక్షణ సమితిని ఆయన ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ సమితి ఫోటో ఉద్యమాలు చేస్తుందా? అని నిలదీశారు. దీనికి వారు సమాధానం చెప్పాలన్నారు. విజయవాడలో బీజేపీ తమకు అండగా నిలబడలేదని , క‌ల‌సి పోటీ చేయ‌డంతో త‌మ పార్టీకి న‌ష్టం బాగానే జ‌రిగింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement