Wednesday, May 8, 2024

పాపం మందుబాబులు… 4రోజులు దుకాణాలు బంద్

మందుబాబులకు మరోసారి సర్కార్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలకు నాలుగు రోజులపాటు తాళం వేయనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుండి ఆదివారం వరకు మద్యం దుకాణాలు మూతపడతాయి. శుక్రవారం సాయంత్రం 4గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.

దీంతో అప్పటి నుంచి 14వ తేదీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అలాగే 17వ తేదీ ఫలితాలు వచ్చే రోజు కూడా దుకాణాలు ఎట్టి పరిస్థితుల్లో తెరువ కూడదని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement