Wednesday, May 15, 2024

11వ వ‌సంతంలోకి వైఎస్సార్సీపి…..

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం…

అమరావతి, : ఇడుపులపాయలో 2011మార్చి 12వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సాక్షిగా ఆవిర్భవించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కడితో మొదలై..వందలు, వేలు, లక్షల మందిని దాటి నేడు కోట్లాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం పొందింది. మహానేత ఆశయ సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన వైయస్సా ర్సీపీ శుక్రవారం అనగా మార్చి 12న 11వ వసంతంలోకి అడుగిడతోంది. అతి తక్కు వ కాలంలో పార్టీకి పెద్ద సంఖ్యలో ప్రజ లు అభిమానుల య్యారు. పదేళ్లలోనే పటిష్ట మైన ప్రజా ప్రభు త్వాన్ని ఏర్పాటు- చేసి రాజన్న కల లను సాకారం చేస్తూ.. సకల జనులకు సంక్షేమ పథకాలు అంద జేస్తున్నారు ముఖ్య మం త్రి వైయస్‌ జగన్‌ మోహ న్‌ రెడ్డి. దేశంలోనే ఎక్కడాలేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విప్లవాత్మక చట్టాలు, నిర్ణ యాలతో దేశానికే ఆ దర్శంగా నిలిచారు యువ ముఖ్య మంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.
కాంగ్రెస్‌ కనుమరుగు
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2010లో సోనియా గాంధీతో విభేదించి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చా రు. 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ నేడు రాష్ట్రం లో కనుమరుగైంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు టీ-డీపీ పార్టీ కోటకు బీటలు వచ్చాయి. రాష్ట్రంలో మరే పార్టీకి అంద నంత ఎత్తులో ఓట్ల శాతా న్ని పెంచుకొని తిరుగు లేని పార్టీగా అవతరించింది.
అనునిత్యం ప్రజల కోసం
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ అనునిత్యం ప్రజల తరఫున ఉద్యమబాట పట్టా రు. నాడు టీ-డీపీ ప్రభుత్వం అవలంభించిన ప్రజావ్యతిరేక విధా నాలపై ఎప్పటి కప్పుడు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళ నలు చేపట్టారు. ప్రత్యేకహోదా కోసంఆదినుంచి పోరాటం చేస్తు న్న ఏ-కై-క నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క వైయస్‌ జగనే అన్న రీతిలో పోరాటాలు చేశారు. 2017 నవంబరు ఆరో తేదీ వైయస్‌ జగన్‌ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని నేనున్నానని హామీ ఇచ్చారు. 2019లో రెండే పేజీలతో మేనిఫెస్టో రూపొందించి తానే ఏం చేస్తారో చెప్పి ఎన్నికలకు వెళ్లారు. ప్రజలు జననేతను నమ్మారు. ముఖ్యమంత్రి అయింది మొదలు మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉన్నారు.
సంపూర్ణ ప్రజాబలంతో ప్రభుత్వం ఏర్పాటు-
జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గడచిన పదేళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు- చేసింది. అధికారం చేపట్టిన 20నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90 శాతాన్ని మన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా వైఎస్‌ జగన్‌ అమలు పరుస్తూ… పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ… తిరుగులేని పాలన అందిస్తున్నారు. అందుకు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే తగిన ఉదాహరణ. మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోనున్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలే ఊపిరిగా కృషి చేస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో సీఎం జగన్‌ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈ ప్రయాణంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాల సాధనే ధ్యేయంగా పార్టీ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో వచ్చిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకొనున్నారు.
రికార్డు విజయాలతో ప్రారంభమైన పార్టీ ప్రస్తానం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2011లోజరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్‌ విజయమ్మ, కడప ఎంపీగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. 2011లోఉప ఎన్నికలకు ముందు వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీసీ అభ్యర్థి అఖండ విజయం సాధించారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 10 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, గ్రామగ్రామాన, ప్రతీ పట్టణాల్లోని వార్డుల్లో, నగర కార్పొరేషన్ల పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించాలని, ఘనంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుల చేశారు. ఈ మేరకు పార్టీ పండుగ ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement