Saturday, May 18, 2024

పంజా విసురుతున్న కరోనా మహమ్మారి… 117 మంది మృతి

దేశంలో మరోసారి కరుణ మహమ్మారి పంజా విసురుతోంది. ఈ ఏడాది 2021లో 24 గంటలలో 23 వేల పైన కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది ఇదే సమయంలో ఈ మహమ్మారి దేశంలో దాపురించింది. ఇప్పుడు మళ్ళీ ఇదే సమయానికి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటలలో దేశ‌వ్యాప్తంగా కొత్తగా 23,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . మరోవైపు కరోనా కారణంగా ఒక్కరోజు 117 మంది మ‌ర‌ణించారు.

దీనితో ఇప్పటివరకు దేశంలో న‌మోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,08,846కు చేరింది. అలాగా ఈ మహమ్మారి బారి నుంచి 1,09,53,303 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,97,237 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా దేశంలో 1,58,306 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement