Friday, May 17, 2024

కేటీఆర్ గాలి తీసేసిన విజయశాంతి..

అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తానన్నట్టు టిఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు బిజెపి సీనియర్ నేత విజయశాంతి. విశాఖ ఉక్కు ఉద్యమంకు మద్దతుగా కేటీఆర్ విశాఖ వెళ్లి ధర్నా చేస్తాననడం పై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కెసిఆర్ కుటుంబం ఎలాంటి హామీలు ఇచ్చిందో గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు విజయశాంతి. ఇదే విషయమై విజయశాంతి ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారని… ఇప్పుడు మాటమాత్రంగానైనా ప్ర‌స్తావించ‌డం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసమే ఈ మాటలు… ఆంధ్ర ప్రాంత ప్రజలపై కేసీఆర్ కుటుంబం తీరు ఎంత అసభ్యకరంగా, అవమానించే ధోరణిలో, బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్క‌సారి గుర్తు చేసుకుంటే.. వారి ప్ర‌క‌ట‌ను సమర్థిస్తున్న కొంద‌రు నేతలకు అస‌లు విష‌యం అర్థ‌మ‌వుతుందంటూ ట్విట్టర్ లో విజయశాంతి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement