Sunday, April 28, 2024

Timmapur – ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

..తిమ్మాపూర్ జనవరి 9 ప్రభ న్యూస్.కరీంనగర్ జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ఎల్ ఎం డి ఎస్సారెస్పీ ఇరిగేషన్ కార్యాలయంలో కాలేశ్వరం ప్రాజెక్టుపై అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సహ ఇతర పనులపై విచారణ చేపట్టారు.

విజిలెన్స్ తనిఖీలతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మేడి గడ్డ ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తి డేటా ను అధికారులు సేకరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి అయ్యే వరకు తనిఖీలు చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఇంటలిజెన్స్డిఎస్పీ శ్రీనివాస్ రావు,ఇన్పెక్టర్లు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రావు, డిఈ, ఈఈలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement