Saturday, April 27, 2024

UP Elections: అయోధ్య నుంచి ఎంఐఎం ప్ర‌చారం..

ఉత్తరప్రదేశ్ లో వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పొలిటికల్ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటి నుంచే పార్టీలు తమ కార్యచరణ రూపొందించుకుంటున్నాయి. ఇప్ప‌టికే కొన్ని సంస్థ‌లు ఎన్నిక‌ల‌కు సంబందించి ముంద‌స్తు స‌ర్వేలు ఫ‌లితాలు విడుద‌ల చేశాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌రోసారి విజ‌యం సాధిస్తుంద‌ని, మ‌ళ్లీ సీఎంగా యోగీని ఎంచుకునే అవ‌కాశం ఉంద‌ని ముంద‌స్తు స‌ర్వేలు పేర్కొన్నాయి. ఇక ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో యూపీనుంచి ఎంఐఎం కూడా బ‌రిలోకి దిగుతున్న‌ది. చారిత్ర‌క న‌గ‌ర‌మైన అయోధ్య నుంచి ఎంఐఎం ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌బోతున్న‌ట్టు యూపీ ఎంఐఎం రాష్ట్ర అధ్య‌క్షుడు పేర్కొన్నారు. అయోధ్య‌న‌గ‌రానికి 57 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న రుదౌలీ త‌హసీల్ లో ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌చారం ప్రారంభించ‌బోతున్నారు. ఈ ప్ర‌చారాన్ని ఎంఐఎం చీఫ్ అస‌దుద్ధీన్ ఒవైసీ ప్రారంభించ‌నున్నారు.

ఇది కూడా చదవండి: జగన్ అక్రమాస్తుల కేసు: సీబీఐకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement