Thursday, April 25, 2024

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం.. అప్పుల పరిమితి పెంపు

జగన్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరిన్ని అప్పులు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ లిమిటును రూ. 10,500 కోట్ల మేర పెంచింది. తొమ్మిది నెలల రుణ పరిమితిని రూ. 31,251 కోట్లకు పెంచుతూ అనుమతులు ఇచ్చింది.

2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొత్తంగా అప్పుల తీసుకునేందుకు వెసులుబాటు రూ. 42,472 కోట్ల వరకు ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆర్‌బీఐకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. కేంద్రం నిర్ణయంతో అదనంగా మరో రూ. 10,500 కోట్ల మేర రుణ సమీకరణ చేసుకునే ఏపీకి అవకాశం ఉండనుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రూ. 10,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీకి అవకాశం ఉండనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయంతో జగన్‌ సర్కార్‌‌కు భారీ ఊరట లభించనుంది.

ఈ వార్త కూడా చదవండి: మరో వివాదంలో ఏపీ మంత్రి.. ఎస్సైకి బెదిరింపులు!

Advertisement

తాజా వార్తలు

Advertisement