Sunday, April 28, 2024

జగన్ అక్రమాస్తుల కేసు: సీబీఐకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన కోర్టు

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. పెన్నా ఛార్జ్ షీట్‌లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు మరోసారి సీబీఐ గడువు కోరింది. పెన్నా సిమెంట్స్‌పై కౌంటరుకు చివరి అవకాశం ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐకి ఇదే చివరి అవకాశమని తెలిపింది. పెన్నా కేసులో విజయసాయిరెడ్డి, సబిత, శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.

మరోవైపు అరబిందో, హెటిరో కేసుల వాదనలు వినిపించేందుకు కోర్టును ఈడీ గడువు కోరింది. నిందితులు కూడా వాదనలకు సిద్ధం కావాలని కోర్టు స్పష్టం చేసింది. తన బదులు న్యాయవాది హాజరుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్​పై ఈ నెల 13కు విచారణ వాయిదా వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement