Monday, May 6, 2024

పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు మృతి..

దువ్వూరు, ప్రభన్యూస్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు మండల పరిధిలోని గుట్టపై మంచి నీళ్ల బావి వద్ద ఇద్దరు గొర్రెల కాపరులు పిడుగుపాటు-కు గురై మృతి చెందారు. ఈ ప్రమాదంలో పది గొర్రెలు కూడా మృతువాత పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రమైన దువ్వూరు గ్రామానికి చెందిన నల్లబోతుల హనుమంతు (56), శెట్టిపల్లె మునిరావు (32) ప్రతిరొజూ గొర్రెలను మేపు కొనుటకు వెళ్లేవారు. అందులో భాగంగా సోమవారం ఉదయం గొర్రెలను సమీపంలోని గుట్ట పైకి తోలుకెళ్లారు. వర్షం కురుస్తుండడంతో సమీపంలోని బావి దగ్గరికి వచ్చారు.

ఉరుములు మెరుపులతో పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో ఇద్దరూ పిడుగుపాటు-కు గురై మృతి చెందినట్లు- వారి బంధువులు తెలిపారు. వీరితోపాటు పది గొర్రెలు మృతి చెందాయని వారు వివరించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, టీడీపీ మండల కన్వీనర్‌ బోరెడ్డి వెంకటరమణారెడ్డి, మృత దేహాలను సందర్శించి వారి కుటు-ంబ సభ్యులను పరామర్శించారు. రెండు కుటు-ంబాలలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు- ఎస్‌ఐ కేసీ రాజు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement