Sunday, May 12, 2024

గుంటూరు కొత్త ఏఎస్పీగా అనీల్ కుమార్.. ప‌దోన్న‌తిపై రాక‌!

గుంటూరు క్రైo : గుంటూరు జిల్లా ఎస్పీ అరిఫ్ హాఫిజ్ ను మర్యాద పూర్వకంగా ఏఎస్పీ అనిల్ కుమార్ కలిశారు. 2012 బ్యాచ్ కు చెందిన అనిల్ కుమార్ విజయనగరంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ ప‌దోన్న‌తిపై గుంటూరు వ‌చ్చారు. ఈమధ్య కాలంలో 52 మంది డిఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. పదోన్నతి, బదిలీలో భాగంగా గుంటూరు జిల్లా ఏఎస్పీగా అనీల్ కుమార్ వచ్చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ను అనీల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన ఏఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement