Sunday, May 19, 2024

రోడ్డుప్రమాదంలో.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

మహబూబ్ నగర్ మండలం కోడూరు గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హాజీలాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ (35) తన వరి ధాన్యాన్ని ట్రాక్టర్‌లో రైస్ మిల్లుకు తీసుకెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ట్రాక్టర్‌లో ఉన్న లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్నమాణిక్యమ్మ (52) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

దేవరకద్ర మండలం పర్దిపూర్ తండాకు చెందిన ఓ కుటుంబం నాగర్ కర్నూల్ జిల్లాలోని నాయినోన్ పల్లి మైసమ్మ దర్శనం కోసం బయలుదేరినట్టు సమాచారం. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానికుల సహకారంతో పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement