Friday, May 10, 2024

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్.. ఎమ్మెల్యే దాసరి

అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలైన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 175 మంది లబ్ధిదారులకు 57,83,500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్య భద్రతకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. అనారోగ్యాల భారినపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న వారికి సీఎంఆర్ ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పదింతలు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement