Monday, May 20, 2024

TTD | 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి : తిరుమల శ్రీవారి అర్జిత సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈనెల 18 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌కోసం మే 20 వ తేది ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22 వ తేది మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు అవుతాయి.

కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 17 తేది వరకు వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే 21 వ తేది ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదేవిధంగా వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 21 న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక శ్రీవాణిట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటాను మే 23 వ తేది ఉదయం 11 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23 న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఇక ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేస దర్శన టికెట్ల కోటాను మే 24 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల-తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24 న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మే 27 న తిరుమల-తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. టిటిడి వెబ్‌సైట్‌ ద్వారా శ్రీవారి అర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement