Thursday, May 16, 2024

TS: ఇంటర్ పరీక్షలు స్టార్ట్.. 12మంది విద్యార్థులకు నో ఎంట్రీ

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి ఎంట్రీ కానివ్వమని ముందే తెలపడంతో విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు హాజరవుతున్నారు.ఇవ్వాళ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతించమని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఆదేశాలివ్వడంతో విద్యార్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని కాలేజీ సిబ్బంది.. అరగంట ముందే కేంద్రంలోనికి అనుమతించారు. అయితే నిమిషం నిబంధన కారణంగా నిజామాబాద్ జిల్లాలో 10మంది విద్యార్థులు, వేములవాడలో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వారికి పరీక్ష రాసే అవకాశం కల్పించలేదు. వారిని పరీక్ష హాల్లోకి అనుమతించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement