Friday, May 3, 2024

ఆప్‌లో చేరిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా

ప్రధాని నరేంద్ర మోడీని మిమిక్రీ చేసి ఫేమస్ అయిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. రాజస్థాన్ ఆప్ ఇన్‌ఛార్జ్ వినయ్ మిశ్రా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్యామ్ రంగీలా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసలు కురిపించారు. నా పని నచ్చకపోతే వచ్చేసారి నాకు ఓటు వేయవద్దు అని చెప్పే ఆప్ తప్ప అలాంటి పార్టీని లేదా నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేద‌న్నారు.. నేను అతనిని చూసి ఇంప్రెస్ అయ్యాను ..అందుకే నేను పార్టీలో చేరుతున్నానని చెప్పారు. శ్యామ్ రంగీలా స్వతంత్రంగా పని చేయమని కోరినందున పార్టీ తనకు ఇంకా ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని, అదే సమయంలో, శ్యామ్ రంగీలా పార్టీలో చేరడం గురించి ఆప్ కూడా తెలియజేసింది. AAP ట్వీట్ చేసింది, “రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు శ్యామ్ రంగీలా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. శ్యామ్ రంగీలా తన కామెడీ ద్వారా ప్రజల ముఖాల్లో చిరునవ్వు తెస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement