Sunday, April 28, 2024

టిఆర్ ఎస్..బిజెపిల‌వి దొంగ నాట‌కాలే..బీఎస్పీ నేత ప్ర‌వీణ్ కుమార్..

రంగారెడ్డి : టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ ధర్నాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్. రాజేంద్రనగర్ ఆరెమైసమ్మ చౌరస్తాలో తెలంగాణ మునిసిపల్ కార్మికుల రిలే నిరాహారదీక్షకు ఆయ‌న‌ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వరిరైతుల గురించి టీఆర్‌ఎస్‌, బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని ఫైర్‌ అయ్యారు.మీ రెండు ప్రభుత్వాలు గిడ్డంగుల్లో నిలువ ఉన్న బియ్యాన్ని ఆకలితో అలమటిస్తున్న పేదలకు రేషన్ కార్డ్ ద్వారా పంచితే మీ సొమ్మేంపోతుంద‌న్నారు. సచివాలయం,కమాండ్ సెంటర్లకు వెచ్చించే డబ్బుతో..రాష్ట్రమే రైతుల నుండి వడ్లు కొంటే ఏం పోతుంద‌ని నిప్పులు చెరిగారు. మీ కుటుంబాలు మురికిగుంటలో దిగి పని చేస్తే, కార్మికుల విలువ మీకు తెలుస్తోందని… ప్రమాదమని తెలిసినా కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు… వారి న్యాయమైన డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement