Wednesday, May 8, 2024

గ్రేటర్ లో కరోనా హాట్ స్పాట్ ప్రాంతాలు ఇవే… జాగ్రత్తగా ఉండండి !!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. అయితే అందులో జిహెచ్ఎంసి నుంచి కనీసం లో కనీసం 150 నుంచి 200 వరకు కేసులు నమోదవుతున్నాయి. కాగా ఒక గ్రేటర్ పరిధిలోని 15 వేల టెస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ సంస్థలలో అయితే కనీసం 6500 వరకు టెస్ట్ లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మాస్క్ లు పెట్టుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరగటం.. కరోనా కేసులు పెరుగుదలకు కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ జోన్ లపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. ఇదిలా ఉండగా గ్రేటర్ విషయంలో లో అధికంగా శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, చార్మినార్, ఎల్బీనగర్ ఏరియాలలో అధిక కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement