Monday, May 6, 2024

ఫ్యామిలీతో బైక్ పై షికారు…తండ్రి కూతురు మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఆక్సిడెంట్ జరుగుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనక నుండి లారీని ఢీకొన్న ద్వీచక్ర వాహనం ఢీ కొట్టడం తో ఇద్దరు మృతి చెందారు. ఎదురుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయటంతో ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది.ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు ఇద్దరూ అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయాలపాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు తరలించారు. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న వీరంతా ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త మరియు ఇద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement