Tuesday, May 7, 2024

భార్య హేళన చేస్తుందని ఆత్మహత్య చేసుకున్న భర్త

రోజురోజుకీ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు తిట్టారని, భార్య కాపురానికి రాలేదని, పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని… ఇలా ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా భార్య హేళన చేస్తోందని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే హేళన చేయటంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ తెలిపిన వివరాలు ప్రకారం… SPR హిల్స్ లో నివాసముంటున్న సాయికిరణ్ (24) ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.కాగా బీటెక్ చదువుతున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే భార్య పుట్టింట్లోనే ఉంటూ కాపురానికి రాకపోగా జాబ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతోంది. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement