Friday, April 26, 2024

తిన్నది అరగటం లేదని…లాక్ డౌన్ టైం లో బయటకు వచ్చిన వ్యక్తి!!

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడే లాక్ డౌన్ ను విధిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధించారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులకు… ఓ వ్యక్తి కనిపించాడు. వెంటనే అతనిని ఆపి ఎందుకు బయటకు వచ్చావని పోలీసులు ప్రశ్నించారు.

ఇక పోలీసుల ప్రశ్నకు అతను బయటికి వచ్చిన విషయాన్ని వివరించాడు. బ్యాగ్ లోంచి 50 ఈనో ప్యాకెట్ లను చూపించాడు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అని అడిగితే లాక్ డౌన్…వల్ల ఇంట్లో తిని కూర్చుని ఉండటం వల్ల అరగటం లేదని అందుకే ఈనో ప్యాకెట్స్ కొనడానికి వచ్చానని సమాధానమిచ్చాడు. ఇంక అది చూసిన పోలీసులు మొదట షాక్ కి గురి అయ్యారు. ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని వదిలేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement