Friday, April 26, 2024

బీజేపీలో చేరాలని ఈటెలకు ఆహ్వానం?

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఈటెల రాజేందర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన సొంత పార్టీ పెడతారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారా అన్న విషయంపై పలు చర్చలు నడుస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరతారని కూడా ఊహాగానాలు వచ్చాయి. వీటికి బ‌లాన్ని చేకూర్చేలా ఓ విష‌యం మీడియా దృష్టికి వ‌చ్చింది. ఈటెలను త‌మ పార్టీలో చేరాల‌ని బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది

కేంద్ర స‌హాయ మంత్రి, బీజేపీ నేత‌ కిషన్‌రెడ్డితో పాటు కీల‌క నేత‌ గడ్డం వివేక్‌ ఈటెల రాజేందర్‌తో స‌మావేశం జ‌రిపి ఈ విష‌యంపై చ‌ర్చించిన‌ట్లు సమాచారం. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై కలిసి పోరాటం చేద్దామని వారు ఈటెలను కోర‌గా, దీనిపై త‌న‌ అనుచరులతో చర్చించి, త‌న నిర్ణ‌యాన్ని తెలుపుతాన‌ని ఈటెల రాజేందర్ చెప్పిన‌ట్లు తెలుస్తోందిజ గతంలో కూడా ప‌లువురు బీజేపీ నేత‌ల‌తో ఈటెల మంతనాలు జరిపిన విష‌యం తెలిసిందే. తాజాగా జరిగిన సమావేశానికి మాత్రం అత్యంత ప్రాధాన్యం ఉంది. హైద‌రాబాద్ శివారులోని ఫామ్‌హౌస్‌లో అధికారికంగా జ‌రిగిన ఈ స‌మావేశం అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement