Tuesday, May 14, 2024

శ్రీ‌లంక‌-పాక్ మ‌ధ్య కీల‌క పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌

ఆసియాకప్‌లో భాగంగా ఇవ్వాల పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు జ‌రుగుతోంది. సూపర్‌-4లో వరుసగా రెండు విజయాలతో టీమిండియా ఇప్ప‌టికే ఫైనల్స్‌కు చేరుకోగా.. ఇప్పుడు పాక్‌, శ్రీ‌లంక జట్ల మధ్య జరిగే మ్యాచ్ కీల‌కం కానుంది. ఇవ్వాల‌ గెలిచే జట్టు ఆదివారం జరిగే తుది పోరులో భారత్‌తో త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే ఈ మ్యాచ్‌ పాకిస్తాన్‌-శ్రీలంకకు చావో, రేవో అన్న‌ట్టుగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు సెమీఫైనల్స్ వంటిదే. ఇందులో గెలిచే జట్టు ట్రోఫీ కోసం తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అయితే.. శ్రీ‌లంక‌లో భారీ వర్షాల‌ కారణంగా మ్యాచ్ లేట్ గా ప్రారంభం కాగా, టాస్ గెలిచిన పాకిస్తాన్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement