Thursday, May 16, 2024

Delhi | సీఎం రేవంత్‌తో రాజయ్య భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సోమవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఢిల్లీలోని యమునా అపార్ట్‌మెంట్స్‌ వద్ద సీఎం రేవంత్ బయటికెళ్లే సమయంలో కార్ ఎక్కేముందు రాజయ్య కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి కాసేపు మాట్లాడారు.

అయితే సోనియా గాంధీని కలిసేందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి అక్కణ్ణుంచి వెంటనే బయలుదేరారు. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీని కూడా రాజయ్య కలిశారు. అయితే కాంగ్రెస్‌లో చేరిక విషయంలో అటు పార్టీ నుంచి, ఇటు రాజయ్య నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు. కాంగ్రెస్‌లో చేరి వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ స్థానాన్ని బీఆర్ఎస్ ఇప్పటికే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement