Sunday, April 28, 2024

AP | రేప‌టి నుంచి ఇంటర్‌ పేపర్ల వాల్యుయేషన్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: ఇటీవల ముగిసిన ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన (వాల్యుయేషన్‌ ) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ సోమవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో 4 ఏప్రిల్‌ వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. సుమారు 23,000 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 60 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తారని వెల్లడించారు. ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement