Thursday, May 16, 2024

ఎస్టీ సబ్ ప్లాన్ కు 90 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 90 వేల కోట్లు కేటాయించిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం ద్వారా గిరిజన బిడ్డలకు విద్యా, ఉపాధిలో అదనపు అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో బో బ్రిడ్జి వద్ద బంజారా భవనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూమరెడ్డి కన్వెన్షన్ హాల్ లో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన గిరిజనులకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామని అన్నారు. అయినా కూడా తెలంగాణ గిరిజనుల రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదన్నది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

8 ఏళ్లు వేచిచూసి ఇక ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందని స్పష్టం చేశారు. తద్వారా గిరిజనులకు విద్యలో, ఉపాధిలో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. రిజర్వేషన్ పెంచిన తర్వాత దాదాపు 3985 మంది గిరిజన బిడ్డలకు అదనంగా ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయని, 195 మందికి మెడికల్ కాలేజీల్లో అదనంగా సీట్లు లభించాయని వివరించారు.

సమాజానికి మంచి జరగాలన్న ఉద్ధేశంతోనే సీఎం కేసీఆర్ రిజర్వేషన్లను పెంచారని, రాజకీయం కోసం కాదన్నది ఈ లెక్కలు నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించే నిధులను గత ప్రభుత్వాలు ఇతర అవసరాల కోసం మళ్లించేవని, కానీ 10 పదేళ్లలో ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ. 90 వేల కోట్లు కేటాయించిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. పోడుపట్టాలు, రైతు బంధు, రైతు బీమా, ఫీజు రియింబర్స్ మెంట్ వంటి అనేక ప్రయోజనాలు గిరిజనులకు లభిస్తున్నాయన్నారు.

178 మోడల్ పాఠశాలలను నిర్మించామని, అన్నింటికీ జూనియర్ కాలేజీలుగా విస్తరిస్తున్నామని చెప్పారు. 60 ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ 90 పాఠశాలలను ఏర్పాటు చేస్తే 9 ఏళ్లుగా పరిపాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ190 పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రతీ జిల్లా కేంద్రంలో హాస్టల్ తో కూడిన డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

సమ్మక్క సారక్క మేడారం జాతరకు ఇప్పటి వరకు రూ. 400 కోట్లు ఇచ్చామని, ప్రతీ తండాకు రోడ్డు వేశామన్నారు. 3200పైగా తండాలను గ్రామ పంచాయతీ హోదా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. బంజారాల కోసం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎన్నో పనులు చేసిందని, ఎన్ని పనులు చేసినా కూడా రాష్ట్రంలో 10 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే అది కేవలం గిరిపత్రుల వల్లనే వచ్చిందని తాను ఎప్పడూ చెబుతుంటానని అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వరంగల్ ప్రాంతంలో ఓ తండాలో నిద్రించిన క్రమంలో అక్కడే ఇళ్లు దగ్దమయ్యి బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న డబ్బు పోవడంతో వారు సీఎం కేసీఆర్ ను ఆశ్రయించి రూ. 50 వేలు ఇస్తే బిడ్డ పెళ్లి చేస్తామని వారు అన్నారని, ఆ మాట గుర్తుంచుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేశారని వివరించారు. బంజారా భవనం నిర్మాణానికి సహకరించిన మంత్రి సత్యవతి రాథోడ్ కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement