Wednesday, May 8, 2024

స్టే వచ్చిందని గగ్గోలు వద్దు: అయ్యన్న

అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుపై సీఐడీ విచారణకు హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ నేతలు స్టేలు తెచ్చుకుంటూ విచారణ నుంచి తప్పించుకుంటున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. కోర్టులో స్టే వచ్చింది అని గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలకు చిన్న సూచన అంటూ ట్వీట్ చేశారు.

చంద్రబాబుపై రెడ్లతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించాలనే తింగరి ఐడియా ఇచ్చిన అపర మేధావి ఎవడు? అని జగన్ రెడ్డిని నిలదీయాలని హితవు పలికారు. 1000 కీలక పదవులు రెడ్లకు కట్టబెట్టినంత మాత్రాన ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా రెడ్లే పెడతామంటే చట్టాలు చూస్తూ ఊరుకోవని అయ్యన్న పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement