Sunday, May 19, 2024

హోలి సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం నుంచి దక్షిణ మధ్య రైల్వే హోలి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని పలు సందర్భాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 24న హైదరాబాద్‌ (నాంపల్లి) రైల్వే స్టేషన్‌ నుంచి బీహార్‌ రాష్ట్రంలోని రాక్సల్‌ రైల్వే స్టేషన్‌ వరకు 07040 నంబర్‌తో హోలి ప్రత్యేక రైలును, అదేవిధంగా ఈనెల 25న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి గోరఖ్‌పూర్‌ (07003) వరకు మరో రైలును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఈ రైళ్లు ఈనెల 31, 30 తేదీల్లో ఆయా స్టేషన్ల నుంచి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతాయని చెప్పారు. ఇవి పూర్తిగా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న రైళ్లని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement