Friday, May 3, 2024

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ విజృంభిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మళ్లీ రెట్టింపు స్థాయిలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుంది. దీంతో మునుపటి స్థాయిలో మళ్ళీ అన్ని రంగాల వారు కరోనా బారిన పడుతున్నారు. ఇంతకుముందే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది. రెండ్రోజుల కిందటే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.దాంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఎయిమ్స్ వైద్యులు స్పందిస్తూ… ఇప్పుడు ఓం బిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఆయన మార్చి 20న ఎయిమ్స్ లో చేరినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement