Wednesday, May 15, 2024

దళారుల ప్రమేయం లేకుండా శనగల కొనుగోలు..

గజ్వేల్ : గజ్వేల్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు. రైతులకు మేలుచేసేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్నిఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా శనగలనునేరుగా కొనుగోలుచేస్తున్నామని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకుని మార్కెట్‌కు తీసుకు రావాలని సూఇంచారు. తేమశాతం 14లోపు ఉన్న శనగలను మార్కెట్‌కు తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వం కూడా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చిందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement