Saturday, April 27, 2024

లాభాలతో ప్రారంభమై.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. మన దేశంతో పాటు అమెరికా ద్రవ్యోల్బణం తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ఉదయం లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 62,677కి పెరిగింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని 18,660 వద్ద స్థిరపడింది. టెక్ మహీంద్రా (1.84%), టాటా స్టీల్ (1.66%), ఎన్టీపీసీ (1.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.44%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.34%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి..నెస్లే ఇండియా (-1.82%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.16%), భారతి ఎయిర్ టెల్ (-1.13%), ఏసియన్ పెయింట్స్ (-0.95%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.89%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement