Friday, March 29, 2024

సంగీత దర్శకుడు కీరవాణి తల్లి కన్నుమూత.. సంతాపం తెలియజేస్తోన్న ప్రముఖులు

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎంకీరవాణి తల్లి భానుమతి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భానుమతిని కుటుంబసభ్యులు మూడు రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. భానుమతి భౌతికకాయాన్ని ఎస్‌ఎస్‌ రాజమౌళి నివాసానికి తీసుకెళ్లనున్నారు. తల్లి మృతితో కీరవాణి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మాతృమూర్తి మరణంతో తీవ్ర శోకంలో ఉన్న ఎంఎం కీరవాణి కుటుంబసభ్యులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా కీరవాణి తల్లి దర్శకుడు రాజమౌళికి పిన్ని అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement