Thursday, May 16, 2024

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండి.. కేంద్ర ప్రభుత్వానికి డీలర్ల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని జాతీయ రేషన్ డీలర్ల సంఘం తీర్మానించింది. శనివారం ఢిల్లీలోని బగ్గా భవన్‌‌లో భారత రేషన్ డీలార్ల ఫెడరేషన్ జాతీయ కమిటీ సమావేశం జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వంబర్ బసు అధ్యక్షతన సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, జాతీయ కమిటీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ తరఫున జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు హాజరై డీలర్ల సమస్యలపై చర్చించారు. గుజరాత్‌లో డీలర్లకు ఇస్తున్న 40వేల వేతనం, 2 రూపాయల కమిషన్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానించారు. చనిపోయిన డీలర్లకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సమావేశంలో చర్చించినట్టు రాజు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement