Saturday, April 27, 2024

సిరివెన్నెల మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు .. ఎన్. రామ‌చంద్ర‌రావు ..

న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఇక లేరు. అనారోగ్యంతో కొద్ది సేపటి క్రితం ఆయన చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ నెల 24న న్యూమోనియో చికిత్స కోసం ఆయ‌న కిమ్స్ లో చేరారు. కాగా, ఈరోజు (మంగ‌ళ‌వారం) సాయంత్రం 4 గంట‌లకు ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఈ మేర‌కు ఎన్ . రామ‌చంద్ర‌రావు సిరివెన్నెల మృతికి కూ యాప్ లో సంతాపం వ్య‌క్తం చేశారు. సిరివెన్నెల ఎంతోమందికి ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌ని కొనియాడారు.. ఆయ‌న మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోట‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement