Thursday, May 2, 2024

కపిల్ దేవ్ 40ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్ పంత్..

టీమిండియా వికెట్ కీపర్ – బ్యాట్స్‌మన్ అయిన రిషబ్ పంత్ 40ఏళ్ల నాటి కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆడిన పంత్.. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ను 109పరుగులకే ముగించేసింది.

ఇండియన్ బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడి ప్రత్యర్థి జట్టుపై మరింత పట్టు సాధించే దిశగా స్కోరును పెంచేశారు. ఇందులో భాగంగానే కపిల్ 40ఏళ్ల నాటి ఫాస్టెస్ట్ టెస్ట్ ఫిఫ్టీని బ్రేక్ చేసాడు పంత్. 1982లో కరాచీ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కపిల్ దేవ్ కేవలం 30బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాకపోతే ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ 86పరుగుల తేడాతో గెలిచేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement