Saturday, September 21, 2024

జంగారెడ్డిగూడెం వెళ్లనున్న చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు పరామర్శ

అమరావతి, ఆంధ్రప్రభ : జంగారెడ్డిగూడెంలో నాటుసారా సే వించి మృతి చెందిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. ఇప్పటికే 18 మంది కల్తీసారాతో మృతి చెందినట్లుగా వస్తున్న వార్తలతో సోమవారం ఆయన బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు జంగారెడ్డిగూడెం చేరుకుంటారు.

మృతి చెందిన వారి కుటుంబాలతో మాట్లాడటంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించనున్నారు. ఇప్పటికే బాధితుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. మృతి చెందిన వారి కి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాని ్న కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ తరుపున బాధిత కుటుంబాలకు చంద్రబాబు ఆర్థిక సాయం అందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మరోసారి డిమాండ్‌ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement